YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

ప్రధాని, రాష్ట్రపతి ట్వీట్

ప్రధాని, రాష్ట్రపతి ట్వీట్

ప్రధాని, రాష్ట్రపతి ట్వీట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30,
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రిషీకపూర్‌ బుధవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 8:45లకు ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రిషి కపూర్ మృతిపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటన్నారు.ప్రధాని మోదీ సైతం రిషికపూర్ మరణ వార్తపై స్పందించారు. ట్విట్టర్ వేదికాగా ఆయన తన బాధను వ్యక్తం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి, మనోహరం, ఉల్లాసవంతంగా ఉండే మనిషి రిషీ కపూర్. అతను ప్రతిభకి పెద్ద శక్తిలా ఉండేవారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గతంలో ఆయనతో జరిగిన సంభాషణలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. సినిమాలే కాక భారతదేశం పురోగతి పట్ల ఎంతో కూడా ఆయన మక్కువ చూపించారు. అతని మరణం నన్ను చాలా బాధకి గురి చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఓంశాంతి’ అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related Posts