YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం దేశీయం

ప్రముఖుల సంతాపం

ప్రముఖుల సంతాపం

ప్రముఖుల సంతాపం
ముంబై, ఏప్రిల్ 30
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఈరోజు (ఏప్రిల్ 30న) కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతోన్న రిషి కపూర్‌.. నిన్న అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. రిషి కపూర్‌కు భార్య నీతూ సింగ్, కుమారుడు రణ్‌బీర్ సింగ్ ఉన్నారు. నీతూ సింగ్ ఒకప్పటి హీరోయిన్. రణ్‌బీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.కాగా, రిషి కపూర్ మృతితో బాలీవుడ్‌ షాక్‌కు గురైంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. ఆ వెంటనే ఈరోజు రిషి కపూర్ కన్నుమూయడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రిషి కపూర్ ఇకలేరన్న వార్త బయటికి రాగానే బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆ దిగ్గజ నటుడికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. ఈ దు:ఖాన్ని భరించలేనంటూ ట్వీట్ చేశారు. చిన్నారి రిషి కపూర్‌ను తాను ఎత్తుకున్న అలనాటి ఫొటోను లతా మంగేష్కర్ షేర్ చేశారు. అప్పటికి రిషి కపూర్ వయసు 3 నెలలట.ఈ ఫొటోను రిషి కపూర్ స్వయంగా లతా మంగేష్కర్‌కు కొన్ని రోజుల క్రితం పంపారట. తన చేతులతో ఎత్తుకున్న చిన్నారిని ఇప్పుడు తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు రావడం లేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

Related Posts