YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అనంతలో హాస్టళ్లు విలీనం..

అనంతలో హాస్టళ్లు విలీనం..

అనంతలో హాస్టళ్లు విలీనం..
అనంతపురం, మే 1
సంక్షేమ వసతి గృహాలను ప్రక్షాళన చే సే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య కంటే వసతి గృహాల్లో ప్రవేశాలు సగానికి పడిపోయాయి. అయినా గానీ పలు చోట్ల విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపెట్టి వార్డెన్లు నిధుల దుర్వినియోగానికి పాల్పపడుతున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్ హాజరును అరికట్టేందుకు ఎస్సీ సం క్షేమ హాస్టళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్  విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ  ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలే దు. దీంతో హాస్టళ్లలో నిర్దేశించిన దాని కంటే విద్యార్థులు తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనవసర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. మరోవైపు బోగస్ హాజరు నమోదుతో ప్రతి నెలా లక్షల రూపాయల నిధులు దుర్వినియో గం అవుతున్నాయి.అనంతపురం  జిల్లాలో గతేడాది విద్యా సంవత్సరంలో 26 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరంలో మరో 25 వసతి గృహాలు అదే బాటపట్టాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను  మూసివేశారు. జిల్లాలో  2015–16 విద్యా సంవత్సరంలో 26 ఎస్సీ హాస్టళ్లు,  తర్వాత   75 మంది లోపు విద్యార్థులున్నారని, 2016–17 సంవత్సరంలో మరో 25 హాస్టళ్లు ఈ జాబితాలో చేరాయి.నగరంలోని ఎస్సీ నంబర్‌–3 వసతి గృహం, ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు ఎస్సీ వసతి గృహం, తదితర మరో 18 హాస్టళ్లకు  2017–18 విద్యా సంవత్సరంలో  మంగళం పాడనున్నారు. దీంతో బడుగులు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఒకప్పుడు జిల్లాలో 125 హాస్టళ్లతో కళకళలాడిన సాంఘిక సంక్షేమశాఖ ప్రస్తుతం  56 హాస్టళ్లకు పడిపోయి వెలవెలబోతోంది.విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది.ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను సమీప హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 3,4,9,10 తరగతుల విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేస్తారు. 5,6,7,8 తరగతుల విద్యార్థులను రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విలీనం చేయనున్నారు.

Related Posts