YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

విజయ్ రూపానీకి జగన్ ధన్యవాదాలు

విజయ్ రూపానీకి జగన్ ధన్యవాదాలు

విజయ్ రూపానీకి జగన్ ధన్యవాదాలు
విజయవాడ,  మే 1,
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడంలో సహకరించినందుకు ధన్యావాదాలు తెలిపారు.గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులందరూ ఎట్టకేలకు రాష్ట్రానికి చేరుకున్నారు. గుజరాత్‌ నుంచి 12 బస్సుల్లో ఏపీకి బయల్దేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌ డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడంలో సహకరించినందుకు విజయ్‌ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి స్వయంగా ఫోన్‌ చేయడమే కాకుండా.. పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష చేపట్టారు. అలాగే మత్య్సకారుల బాగోగులు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా గుజరాత్ పంపించారు. వారిని క్షేమంగా ఏపీకి తరలించేందుకు రూ. 3 కోట్లు మంజూరు చేశారు.

Related Posts