బుచ్చయ్య చౌదరీ నిరాహర దీక్ష
రాజమండ్రి మే 1
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరీ 12 గంటల నిరసన దీక్షను చేపట్టారు.*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పిలుపు మేరకు స్దానిక గాంధీపురం-3 రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన నివాసంలో ఈరోజు నిరసన దీక్షకు దిగారు.గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం అడిగిన డిమాండ్ల సాదనకై ఈరోజు నేను 12 గంటల పాటు నిరసన దీక్ష చేప్పట్టినట్టు తెలియజేశారు అసంఘటిత కార్మికులకు 5000 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలను అదుకోవాలని,అన్నా క్యాంటీన్ లను పున ప్రారంభించాలని డిమాండ్ చేశారు.చంద్రన్న భీమా పధకాన్ని వెంటనే అమలులోకి తీసుకు రావాలని,రాష్ట్రంలో రైతాంగ సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.