రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు: నఖ్వీ
న్యూఢిల్లీ మే 1 మే 1
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం పేదలను సరిగా పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచమంతా కరోనావైరస్పై పోరాటం చేస్తుంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బిజీగా ఉందని నఖ్వీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం పోరాటం చేయాలని సూచించారు. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు