YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరొన భయంతో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

కరొన భయంతో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

కరొన భయంతో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ మే 2,
కరోనా వైరస్ భయంతో మానసిక అందోళనకు గురైన ఓ వ్యక్తి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ రామంతాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వీఎస్ అపార్టుమెంటులోని మూడవ అంతస్థులో  నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60 ) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్ధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు తరచూ ఆయాసం వస్తోంది. దీంతో తనకు కరోనా సోకిందేమోనని కృష్ణమూర్తి ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి అసుపత్రికి తీసుకెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ అయన అందోళన చెందుతుండడంతో నేడు గాంధీ అసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈలోపే కృష్ణమూర్తి అపార్టుమెంటులోని తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు అపార్టుమెంటు వద్దకు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.

Related Posts