YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వలస కూలీలు ఆఫీసర్ల ద్వారా మాత్రమే రండి : కిషన్ రెడ్డి

వలస కూలీలు ఆఫీసర్ల ద్వారా మాత్రమే రండి : కిషన్ రెడ్డి

వలస కూలీలు ఆఫీసర్ల ద్వారా మాత్రమే రండి : కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, మే 2
రాష్ట్రాల అభ్యర్థన మేరకే కేంద్రం మరో రెండు వారాలపాటు లాక్‌‌డౌన్‌ను పొడిగించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ అమలు ప్రజలు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను తరలించడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందన్నారు. వలస కూలీలు ఎవరూ నేరుగా రైల్వే స్టేషన్లకు రావొద్దని సూచించారు. సొంత రాష్ట్రాలకు వెళ్లాలని భావించే వారు నోడల్ ఆఫీసర్లు లేదా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని కిషన్ రెడ్డి సూచించారు.రైలు ఎక్కే ముందు ప్రయాణికులకు రాష్ట్రాలే ఆహరం అందించాలని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణ సమయంలో రైల్వే శాఖ వారికి ఆహారం అందిస్తుందన్నారు. శుక్రవారం ఆరు ప్రత్యేక రైళ్లను నడిపామని మంత్రి తెలిపారు. వలస కూలీలను తరలించడానికి 300 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్రమపద్ధతిలో వలస కార్మికుల వివరాలను సేకరించాలని కిషన్ రెడ్డి రాష్ట్రాలను కోరారు. సమయం పట్టినా తాము వలస కార్మికులందర్నీ తరలిస్తామని తెలిపారు. దూరం ఎంతైనా సరే రూ.50 ఛార్జీ మాత్రమే వసూలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని వలస కార్మికులు పని చేసే సంస్థలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలన్నారు.ఏపీలో చిక్కుకుపోయిన వారు 917761110 నంబర్‌కు డయల్ చేసి నోడల్ ఆఫీసర్‌‌ను సంప్రదించొచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ‌లో చిక్కుకున్న వారు 7997950008 నంబర్‌కు ఫోన్ చేసి నోడల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాను సంప్రదించొచ్చని లేదంటే తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లను సంప్రదించొచ్చన్నారు. వలస కార్మికులు ఉన్న ప్రాంతానికి ప్రభుత్వం బస్సులను పంపుతుందని.. హెల్త్ టెస్టులు చేసిన తర్వాత నేరుగా బస్సులో రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారని కిషన్ రెడ్డి చెప్పారు. నేరుగా ఎవరూ రైల్వే స్టేషన్‌కు రావద్దన్న ఆయన.. నోడల్ ఆఫీసర్ల ద్వారా వచ్చిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. స్టేషన్లో ఎలాంటి టికెట్లను విక్రయించరని తెలిపారు.

Related Posts