ఎట్టకేలకు బయటకు వచ్చిన కిమ్
న్యూ ఢిల్లీ మే 2,
గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బహిరంగ సమావేశాలకు దూరంగా ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. మేడే సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక కెమికల్ ఫ్యాక్టరీ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడారు.కొద్ది రోజులుగా హృదయ సంబంధిత వ్యాధితో కిమ్ బహిరంగంగా కనిపించలేదు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని అందరూ అనుకున్నారు. ఒక దశలో ఆయన మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అతి భారీ శరీరం కారణంగా ఆయన కొద్ది నెలలుగా హృద్రోగంతో ఇబ్బంది పడ్డారు. చైనా నుంచి ప్రత్యేక వైద్యుల బృందం కూడా కిమ్ పరిస్థితి తెలుసుకోవడానికి అక్కడకు వెళ్లింది. చివరకు కథ సుఖాంతం అయింది.