కూరగాయల పంపిణీ చేసిన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్
నందికొట్కూర్ మే 2
పగిడ్యాల మండలం నెహ్రు నగర్ గ్రామంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు శనివారం నాడు గ్రామ సచివాలయంలో 32 మంది వాలంటీర్స్.9 మంది ఆశ వర్కర్స్.6 పారిశుద్ధ కార్మికులు. ఐదు రకాల కూరగాయల పంపిణీ చేశారు. నర్సులకు.శానిటైజర్లలను. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రమే దేశ, రాష్ట్ర సంపదకు మూలం అన్నారు. కార్మికులు కష్టపడి పనిచేసి వారి జీవితాలను ధారపోయడం వల్లే దేశం రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందన్నారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో చాలా మంది వాలంటేర్స్ . ఆశ వర్కర్స్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్నారన్నారు.సమశ్యాలను కొనియాడారు. వారు ప్రజలకు చేసే కృషి శుభపరిణామమన్నారు. జిల్లా. పోలీస్.డాక్టర్లు. పారిశుద్ధ కార్మికులు యంత్రాంగం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక విధాలుగా కృషి చేస్తోందన్నారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించి ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వం చేసే ఉచిత కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు మీ ఇంటిలోనే స్వీయ నిర్బంధాన్ని పాటిస్తే ప్రభుత్వ క్వారంటైన్ కి రావాల్సిన అవసరం లేదన్నారు. కావున కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈకారిక్రమంలొ వాలేంటిర్స్ గ్రామ సచివాలయం ఉద్యొగులు పాల్గొన్నారు.