YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ నిర్లక్షమే కరోనా వ్యాప్తికి కారణం

ప్రభుత్వ నిర్లక్షమే కరోనా వ్యాప్తికి కారణం

ప్రభుత్వ నిర్లక్షమే కరోనా వ్యాప్తికి కారణం
అమరావతి  మే 2
విజయవాడలో కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ కరోనా మహమ్మారిని చాలా తేలిగ్గా చూశారన్నారు.  జగన్ చేసిన వ్యాఖ్యల వల్ల.. ప్రజలు కూడా కరోనాను సీరియస్గా తీసుకోలేదని నాని పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా పేదలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కడుపు నింపేలా సాయం అందించాలన్నారు.  ప్రతి పేదవాడికి రోజుకు వంద రూపాయల చొప్పున లాక్ డౌన్ ఎన్ని రోజులు అయితే అన్ని వందల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని కేశినేని నాని పేర్కొన్నారు.

Related Posts