మూగజీవాల ఆకలితీర్చడం మరువలేనిది
విశ్వహిందూ పరిషత్ నేత రాధాక్రిష్ణారెడ్డి
జగిత్యాల, మే 2
విపత్కర పరిస్థితుల్లో ఆకలికి అలమటిస్తున్న మూగజీవాల ఆకలి తీర్చడం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుందని విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఊట్కూరి రాధాక్రిష్ణారెడ్డి ఎడబ్ల్యూజెఏ నేత కిషన్ రెడ్డి లు అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద పండ్లు, ఇతర ఆహారపదార్థాలను విహెచ్పి నేత తన మిత్రులతో కలిసి శనివారం కోతులకు అందజేశారు అలాగే కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పనులకోసం వచ్చిన బీహార్ వలస కూలీలు ఇక్కడే చిక్కుకుపోగా వారితోపాటు భక్తులకు,ఆలయ సిబ్బందికీ, కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులను కరీంనగర్ ఆర్టీసీ కండక్టర్ పర్రెం జనార్దన్ రెడ్డి, పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి అంగన్వాడీ టీచర్ అరుణలు రాధాక్రిష్ణా రెడ్డి, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా రాధాకృష్ణా రెడ్డి, కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు చూపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దీ దృష్ట్యా ఆలయాలను మూసివేయడంతో కొండగట్టు క్షేత్రం లో కోతులకు ఆహారంలేక అలమటిస్తున్న సమయంలో మూగజీవాలకు కొన్ని రోజులుగా పండ్లు, ఆహారపదార్థాలను అందిస్తూ కొంతమేరకు ఆకలితీర్చుతున్నామని చెప్పారు. కొండగట్టు లోని కోతులకు, కూలీలు, తదితరులకు మాతోపాటు యువజన సంఘాలు ఆకలీతీర్చుతున్నారని పేర్కొంటూ ఇది జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని రాధాక్రిష్ణా రెడ్డి , కిషన్ రెడ్డి లు తెలిపారు