YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రుణమాఫీ పై ప్రభుత్వం స్పందించాలి..

రుణమాఫీ పై ప్రభుత్వం స్పందించాలి..

రుణమాఫీ పై ప్రభుత్వం స్పందించాలి..                
 కందుల డబ్బులు చెల్లించాలి......                 
బిజెపి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.....          
ఆదిలాబాద్ మే 02
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన కందుల డబ్బులను వెంటనే చెల్లించాలని,రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతు శనివారం బిజెపి నేతలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ జిల్లాలో గత 4 నెలల క్రితం ప్రభుత్వం నేరుగా రైతు నుండి కందుల ను కొనుగోలు చేసి ఇంత వరకు డబ్బులను రైతు ఖాతాలో జమ చేయడం లేదని అన్నారు. రైతులు ప్రభుత్వ చర్య వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు, మరో పక్క రైతులు పండించిన చెనగా పంట కొనుగోలు చేస్తామని చెప్పి మట మర్చిందన్నారు.చెనగా కొనుగోలు కోసం గన్ని బ్యాగులు రైతులే తమ వెంట తీసురవాలని చెప్పడం సబబేనా అని ప్రశ్నించారు. వెంటనే బేషరతుగా చెనగా పంటను ప్రభుత్వ మె కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. టి ఆర్ యస్ ప్రభుత్వం పంట రుణాల మాఫీ పై స్పష్టత ఇవ్వాలని కోరారు. లేని యెడల రైతుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వి.అదినాథ్ ప్రవీణ్ కుమార్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts