YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

శుభవార్త! దేశంలో కరోనా నుంచి కోలుకున్న 10 వేల మంది

శుభవార్త! దేశంలో కరోనా నుంచి కోలుకున్న 10 వేల మంది

శుభవార్త! దేశంలో కరోనా నుంచి కోలుకున్న 10 వేల మంది
దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 వేలు దాటింది.కరోనా కేసులు పెరుగుతున్నా.. ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నా.. అటు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో పెరుగుతుండటం ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 వేలు దాటింది. శనివారం (మే 2) సాయంత్రం 5 గంటల వరకు కరోనా నుంచి 10,018 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2411 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,776కు చేరింది. దేశంలో రికవరీ రేటు 26.51 శాతంగా ఉంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో 71 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,223కు చేరింది. ప్రస్తుతం 26,535 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related Posts