YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇక పతంజలి డ్రెస్సులు

ఇక పతంజలి డ్రెస్సులు

ఇప్ప‌టికే ఎఫ్ఎంసీజీ కంపెనీల‌కు గ‌ట్టి పోటీనిస్తున్న ప‌తంజ‌లి.. త్వరలో దుస్తుల తయారీ విభాగంలో కూడా ప్రవేశించనుంది. ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, పేస్టులు తదితర వస్తువులను మార్కెట్‌లోకి విడుదల చేసిన పతంజలి బ్రాండ్‌.. ఇప్పడు బ్రాండెడ్‌ దుస్తులను కూడా లాంచ్‌ చేయనుంది. వచ్చే ఏడాది తమ సంస్థ గార్మెంట్స్‌ తయారీ విభాగంలోకి ప్రవేశించనుందని యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు.వచ్చే ఏడాది వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) నిర్వహిస్తున్న ’గోవా ఫెస్ట్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబా రాందేవ్‌ వెల్లడించారు. ‘మార్కెట్లోకి మీ కంపెనీ జీన్స్‌ ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. అందుకే వచ్చే ఏడాదిలో దుస్తులు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. పిల్లలు, పురుషులు, మహిళలు .. అందరికీ సంబంధించిన గార్మెంట్స్‌ ప్రవేశపెడతాం‘ అని ఆయన వివరించారు. అలాగే.. క్రీడ‌లు, యోగాకు ఉపయోగపడే గార్మెంట్స్‌ కూడా ప్రవేశపెడతామని బాబా రాందేవ్‌ తెలిపారు.స్వదేశీ దుస్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన గతేడాదే తెలిపారు. పతంజలి ఆయుర్వేద్‌ ప్రతీ ఏడాది ఆర్థికంగా మరింత మెరుగైన పనితీరు సాధిస్తున్నట్లు, త్వరలోనే టర్నోవర్‌పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగగలదని బాబా రాందేవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకోకపోవడం వల్ల గణనీయంగా డ‌బ్బు ఆదా అవుతోందని ఆయన చెప్పారు. సాధారణ ప్రజానీకంతో తమకు ఉన్న సంబంధాలే .. బ్రాండ్‌ ఎదుగుదలకు ఉపయోగపడుతోందన్నారు.

Related Posts