అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి లో శనివారం కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరారు. జీవో 27ను సవరించి ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. నల్ల బ్యార్జీలు ధరించి విధులు బహిష్కరించి ఉదయం గంటపాటు ఆసుపత్రిలోని ఓపీ బ్లాక్ వద్ద ఆందోళన కొనసాగించారు. న్యాయ బద్ధమైన తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే, మంత్రులు కృషి చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీదేవి కోరారు.