కనీసం ఏడు వేల రూపాయల సహాయం అందించాలి
భద్రాద్రి మే 4
సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో సిపిఐ నేతలు ధీక్షలు చేపట్టారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ, ప్రైవేటు రంగం, వలస కూలీలకు 7 వేల రూపాయల కనీస ఆర్దిక సహాయం కోరుతూ కొత్తగూడెం శేషగిరి భవన్ లో మాజీ యం ఎల్ ఎ, సిపిఐ రాస్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృతత్వంలో జిల్లా నాయకులు ధీక్షలు చేపట్టారు. కరోనా విపత్తు సమయం లో ప్రజల అవసరాలను సైతం గుర్తించాల్సిన బాద్యత ప్రభుత్వాల పై ఉంటుందని కూనంనేని పేర్కొన్నారు. కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలు బాద్యతాయుతం గా వ్యవహరించాలని , లేని పక్షం లో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని కూనంనేని హెచ్చరించారు.