కలెక్టర్ కు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లేఖ
కర్నూలు మే 4
కర్నూలు కర్నూల్లో క్షేత్ర స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి, స్థితి గతులపై కలెక్టర్ వీరపాండ్యన్ కు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లేఖ రాసారు. రెడ్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్ డౌన్ నిర్వహణలో అనుసరించాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేసారు. రెడ్ జోన్ పరిధిలో ప్రజాఅవసరాలు వారికి చేరేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పాలు, పండ్లు, మందులు, సరఫరా వార్డు వాలంటీర్ల ద్వారా పటిష్టంగా చెపట్టాలి. రెడ్ జోన్లలో అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందించాలని సూచించారు. కర్నూలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం, అధికారులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. రోజుకో కొత్త రూపంలో కరోనా నగరంలో తన ప్రతాపం చూపుతోంది. కర్నూల్ నగరంలో కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అయన పేర్కోన్నారు.