దేశవ్యాప్తంగా మరో 5,553 కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ మే 4
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా, 72 మంది దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42,553కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 11,706 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా 1,373 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 29,453 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12,974 కరోనా కేసులు నమోదు కాగా, 548 మంది మృ తిచెందారు. ఆ తర్వాత గుజరాత్లో 5,428, ఢిల్లీలో 4,549, తమిళనాడులో 3,023, రాజస్తాన్లో 2,886, మధ్యప్రదేశ్లో 2,846, ఉత్తరప్రదేశ్లో 2,645 కరోనా కేసులు నమోదయ్యాయి.