టెలీమెడిసిన్ మరింత బలోపేతం
సమీక్షా భేటీలో సీఎం జగన్
అమరావతి మే 4
కరోనా కట్టడి చర్యలపై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్షించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వెరీ యాక్టివ్ క్లస్టర్లు 65 ఉన్నాయని చెప్పారు. యాక్టివ్ క్లస్టర్లు 86 ఉండగా, డర్మిటరీ క్లస్టర్లు 46 ఉన్నాయని వివరించారు. గత 28 రోజులుగా ఒక్కకరోనా కేసు కూడా లేని క్లస్టర్లు 50 ఉన్నాయని చెప్పారు. ఇంకా రాష్ట్రంలో టెలీమెడిసిన్ వ్యవస్థ బలోపేతం కావలని జగన్ అధికారులను ఆదేశించారు. కీలకమైన కాల్ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాలలో ఉంచాలన్నారు. దిశ, టెలిమెడిసిన్, అవినీతి నిరోధానికి సంబంధించిన ఏసీబీ, వ్యవసాయం తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే వలసకూలీలు, యాత్రికులు, విద్యార్ధుల అంశంపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. వలసకూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థుల గ్రూపులకే రాష్ట్రంలోనికి రావడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. వెబ్సైట్ ద్వారా అప్లైచేసుకున్న వారిని పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామని వివరించారు.