YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

యాత్రకు మంచి స్పందన : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్

 యాత్రకు మంచి స్పందన : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్

వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లు వరంగల్ లో గెలుస్తాం.  బస్సుయాత్రకు మంచి ఆధరణ వస్తుందిని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ లో అయన మీడియాతో మాట్లాడారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. సామాన్య ప్రజలను టీఆర్ఎస్ పట్టించుకోవడంలేదన్నారు. రైతులకు రూ.4వేల సాయం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమే అని ఉత్తమ్ అన్నారు. వరంగల్ రైతుల పరిస్థితి చాలా దీనంగా వుంది.  రేపు డోర్నకల్,  మహబూబాబాద్ లో బస్సుయాత్ర వుంటుంది. బస్సు యాత్ర తిరిగి ఈ నెల  15 నుంచి జరుగుతుందని ఉత్తమ్ వెల్లడించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ ప్రవేట్ యూనివర్సిటీ లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రవేట్ యూనివర్సిటీ బిల్లు విషయమై కేయూ కు వెళ్లి విద్యార్థులను కలుస్తా. త్వరలో ఉస్మానియా లో రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. 

Related Posts