YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగన్ ది మ్యాచ్ ఫిక్సింగ్ : మంత్రి నక్కా ఆనందబాబు

జగన్ ది మ్యాచ్ ఫిక్సింగ్ : మంత్రి నక్కా ఆనందబాబు

అధికార వ్యామోహం తో ఎంతకైనా బరితెగించి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని  సీఎం పదవికోసం సంతకాలు చేపట్టిన వ్యక్తని మంత్రి నక్కా అనందబాబు మండిపడ్డారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి, అవాకులు చావకులు మానుకోవాలి .నోటికి ఏది వస్తే ఆది మాట్లాడితే కాల గర్భంలో కాలసిపోతాడని అయన అన్నారు. నీమనస్థత్వం , నీవు పెరిగిన త్వత్వం నీచం. పార్లమెంట్ సమావేశాలు 13 రోజులపాటు జరిగితే ఒక్కరోజు కూడా మోడీని, అమిత్ షా ని గాని విమర్శించిన దాఖాలాలు లేవు.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించిన వ్యక్తి  జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి అడుగడుగునా అడ్డుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుంటే ఒక్కమాట మాట్లాడడని అయన ఆరోపంచారు.  రాజకీయ లలో 40 సంవత్సరాల  సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు. 16 నెలలు జైలులో ఉన్న అనుభవం జగన్మోహన్ రెడ్డిది . కేంద్రం సహకరించకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. 

Related Posts