YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రొవిజినల్ షాపులపై విజిలెన్స్ దాడులు

ప్రొవిజినల్ షాపులపై విజిలెన్స్ దాడులు
 

ప్రొవిజినల్ షాపులపై విజిలెన్స్ దాడులు
చిత్తూరు మే 5
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో నిత్యావసర సరుకులు అధిక ధరలకుఅమ్మకాలు చేస్తున్న షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ శేఖర రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాల మేరకు కేటాయించిన ధరల కంటే ఎక్కువ ధరలు పెంచి అమ్మిన షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారని తెలిపారు. పెసరపప్పు 125 రూపాయలు ఉంటే 140 రూపాయలు, పచ్చి శనగలు 65 రూపాయలు ఉంటే 74 రూపాయలు, ఉద్దిపప్పు 125 ఉంటే140 రూపాయలకు అధిక ధరలతో అమ్మకాలు చేస్తున్నారు అని. నాలుగు షాపులు సీజ్ చేశామని తెలిపారు.  అందులో రెడ్డి అన్న షాపు, మెగా మార్ట్, వి జె ఆర్ షాపుల పై దాడులు నిర్వహించామని తెలిపారు.

Related Posts