YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న ఉద్యోగులను ఆడుకున్న వాచ్ మెన్ పై దాడి

అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న ఉద్యోగులను ఆడుకున్న వాచ్ మెన్ పై దాడి

అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న ఉద్యోగులను ఆడుకున్న వాచ్ మెన్ పై దాడి
వాచ్ మెన్ మృతి..
కూచిపూడి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా..
విజయవాడ మే 5,
కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కూచిపూడిలో దారుణం చోటు చేసుకుంది.. కొందరు వైన్షాపు ఉద్యోగులు ప్రభుత్వ మద్యం షాపు నుంచి అక్రమంగా మద్యం తరలించేందుకు యత్నించారు. కాగా ఈ అక్రమ మద్యం తరలింపును గమనించిన వాచ్మెన్ మద్దాల కోటేశ్వరరావు ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు, వాచ్మెన్పై దాడి చేసి మద్యాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. విషయం తెలిసిన కోటేశ్వరరావు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కోటేశ్వరరావు ను కొట్టి పురుగుల మందు తాగించి చంపారు అనీ కుటుంబ సభ్యుల వాదన. కోటేశ్వరరావు గతంలో ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు.. పోలీసులు జోక్యం చేసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related Posts