YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం మత్తులో మర్డర్

మద్యం మత్తులో మర్డర్

మద్యం మత్తులో మర్డర్
విశాఖపట్నం మే 5
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మద్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. అయితే ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒడిషాకు చెందిన వారు ఓ హోటల్లో పని చేస్తున్నారు. సోమవారం  రాత్రి వారి మధ్య చిన్న గొడవ జరిగింది. అందులో ఒకరికి గొంతుపై, మరొకరికి తలపై గాయాలు అయ్యాయి. రక్తస్త్రావం తీవ్రంకావడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి మధ్య గత కొన్నిరోజులుగా స్వగ్రామాలకు వెళ్లే విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయని, అయితే  మద్యం కొనుగోలు చేసి, తాగిన మైకంలో వారు గొడవపడి ఉంటారని పోలీసులు  అనుమానం వ్యక్తం చేశారు
 

 

Related Posts