YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెరాస హయంలో దళితులపై దాడులు : బీజేపీ నేత వేముల అశోక్

తెరాస హయంలో దళితులపై దాడులు : బీజేపీ నేత వేముల అశోక్

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు మేలు చేసింది తప్ప ఎక్కడా అన్యాయం చేయలేదు. దళితుల ఆరాధ్య దైవం అంబెడ్కర్ కీర్తి ని  విశ్వవ్యాపితం చేసిన ఘనత బీజేపీ కి ఉందని ఆ పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం నిర్వీర్యం పై బీజేపీ కి ఎలాంటి ప్రమేయం లేదు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనక పోవడం దారుణమని అన్నారు. బీజేపీ అధికారంలో కి వచ్చిన నుండి ఎలాంటి దాడులు జరుగలేదు.తెరాస ప్రభుత్వం హయాంలోనే నెరేళ్ల ఘటన లాంటి దాడులు జరిగాయని అన్నారు. తెరాస సర్కారు దళితులను దగా చేస్తుంటుంది. రాజయ్యను దించి మాదిగలకు ద్రోహం చేసిన కడియం శ్రీహరి బీజేపీ పై చేసని వాఖ్యలు అర్ధరహితమని అయన ఆరోపించారు. 

Related Posts