విరిగిన కొండ చరియలు..ముగ్గురి మృతి
కిరండల్ రైలు మార్గంలో ప్రమాదం
విశాఖపట్నం మే 6
కొత్తవలస కిరండల్ రైలుమార్గంలో లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బుర్ర మామిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య 65 కిలోమీటర్ల వద్ద కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా వాటిని తొలగించే పనిలో నిమగ్నమైన రైల్వే యంత్రాంగంపై మరోమారు కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో ఒక రైల్వే ఉద్యోగి తో పాటు ఇద్దరు కూలీలు మృతి చెందగా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఎస్ కోట సిబ్బంది సురేష్ కొత్తవలస మండలం ప్రాంతానికి చెందిన కాకర వీర స్వామి,చుక్కా సూరిబాబు లు ఈ ఘటనలో బండరాళ్లు పడి మృతి చెందారు వీరితో పాటు బోస్ అనే రైల్వే ఉద్యోగి తో పాటు కొత్తవలస ప్రాంతానికి చెందిన రమణ, సత్యనారాయణ, అప్పలరాజు, ఈశ్వరరావు, అమ్మ తల్లి అనే కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్ కోట గురించి మెరుగైన వైద్య సేవల కోసం విశాఖ రైల్వే ఆస్పత్రికి తరలించారు