బీహార్ కు వలసకూలీలు
రంగారెడ్డి మే 6,
మంగళవారం ఆర్ధరాత్రి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి 1250 వందల మంది వలస కార్మికులను అధికారులు తరలించారు. 1250 మంది వలస కార్మికుల్ని ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేక రైలులో బీహార్ ,జార్కండ్ కు తరలించారు. అంతకుముందు వలస కూలీలు, కార్మికులకు వైద్య బృందాలు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి. ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ లో భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుండి బస్సుల్లో వచ్చిన కార్మికులకు రాత్రి 9ల నుండి 11.30 వరకు స్క్రిన్ టెస్టులు నిర్వహించి అనంతరం వారికి బోజనం ప్యాకేట్స్ పంపిణీ చేసారు. రాత్రి 12 గంటలకు రైలు బయలుదేరింది. ఈకార్మిక్ స్పెషల్ ట్రైన్ లో మొత్తం 24 బోగిలు వుండగా ఒక్కబోగీలో 55 మందిని ఎక్కించారు.