YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ధరలు పెంచడం అమానుషం

ధరలు పెంచడం అమానుషం

ధరలు పెంచడం అమానుషం
కడప మే 6,
జగన్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం అమానుషం, దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.  కడప జిల్లా వేంపల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.జగన్ ప్రభుత్వం ముందు 25 శాతం, మరలా ఇప్పుడు 50 శాతం మద్యం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం అన్నారు.  తాగుబోతుల బలహీనత ను ప్రభుత్వం సోమ్మ చేర్చుకుంటుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నా పతకాలకు అయ్యే డబ్బులు మొత్తం  మద్యం ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి రానుందని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వెంటనే పెంచిన మద్యం ధరలు తగ్గించాలన్నారు.   లేకపోతే మద్యం పెంచిన పథకానికి జగనన్న పుస్తలు తెంచే పథకమని పేరు పెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచన చేశారు.

Related Posts