కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుంది
సీఎం పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్ మే 6
;రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారనీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయినారు.ఆయనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారనీ,కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందనీ హెచ్చరించారు.కుర్చీ పోయిన తెల్లారి నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవన్నారు.పదవిపోయిన తెల్లారి నీ కుటుంబ సభ్యులెవరు నీ వెంట వుండరనీ,కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే నీవు సీఎం అయ్యావన్న విష్యాన్ని మరిచి పోవద్దన్నారు.సోనియా ను ఒప్పించి తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నాయకులు బఫ్యూన్ గాళ్ళు అయ్యారా!,తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.రైతు సమస్యలు మాట్లాడితే చిల్లగాళ్లనీ,చిల్లరగాళ్లని రైతులను అవమాణిస్తారా?ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుకంగా లేరు..తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా ఉంది కేసీఆర్ వైఖరనీ దుయ్యబట్టారు.