మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం
ముంబై మే 6
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానే జిల్లా భివాండి రహ్నాల్ గ్రామంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా కెమికల్ ఫ్యాక్టరీ మూసి ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందన్నారు.