YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

పోలీస్ స్టేషన్ లోనే మందు చోరులు..

పోలీస్ స్టేషన్ లోనే  మందు చోరులు..

పోలీస్ స్టేషన్ లోనే  మందు చోరులు..
కరీంనగర్, మే 6
ఇళ్లలోనో, దుకాణాల్లోనూ చోరీలు జరిగితే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులను పట్టుకుంటారు. మరి అదే.. దొంగతనం ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే జరిగితే.. సరిగ్గా ఇలాంటి ఘటనే కరీంనగర్‌లో జరిగింది. నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అదికూడా మద్యమే దొంగిలించడం గమనార్హం.లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దాడులు చేసిన పోలీసులు సరకును సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో ఉంచిన మద్యం నిల్వలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావించిన పోలీసులు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు, కరీంనగర్ కార్పొరేన్ పరిధిలోని దుకాణాల్లో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ క్రాంతి తెలిపారు. దుకాణాలకు నెంబర్లు కేటాయించిన ప్రకారం సరి-బేసి తేదీల్లో ఎవరికి వారు షాపులను తెరుచుకోవాల్సి ఉంటుంది. ‘‘కార్పొరేషన్‌ పరిధిలో మూడు కేటగిరీలుగా దుకాణాలు విభజించాం. కేటగిరీ-ఎలో నిత్యావసరాలు, మద్యం, నిర్మాణ రంగానికి చెందిన దుకాణాలు ఉంటాయి. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం చెప్పిన సమయాల్లో తెరవొచ్చు. కేటగిరీ-బిలో బట్టలు, పాదరక్షల దుకాణాలు అందుబాటులో ఉంటాయి. వీటికి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తారు. ఇక కేటగిరీ- సిలో హోటళ్లు, స్కూళ్లు, థియేటర్లు తదితరాలు ఉంటాయి.’’ అని కమిషనర్ క్రాంతి తెలిపారు.

Related Posts