చాలా బాధగా ఉంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢిల్లీ మే 7
విశాఖపట్టణం ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ లీక్ విషాదం గురించి వినడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక అధికారుల సమన్వయంతో.. జాగ్రత్తలు పాటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విశాఖలో గ్యాస్ లీకేజీతో భయానక పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో 5 గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కష్ట సమయంలో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.