తెలుగుదేశం ఇన్ ఛార్జ్ తిక్కారెడ్డి
వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న పోలీసులు రౌడీలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం కార్యకర్తల సమావేశంలో తిక్క రెడ్డి
కౌతాళం మే 7
మా కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రజాస్వామ్యం లో అందరికి న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ ప్రభుత్వం రౌడీలను పెంచి పోషిస్తున్నారని వారికి పోలీసులు అదికారులు కొమ్ము కాస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ తిక్క రెడ్డి స్థానిక పొలీస్ స్టేషన్ ను కార్యకర్తలతో ముట్టడి చేసి అధికారులను ప్రశ్నించారు.గురువారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మా కార్యకర్తలకు అండగా ఉంటామని ఎవరు అధైర్యపడవద్దు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిప్పుల దొడ్డి లో వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్త ఆన్మెషీ ని కొట్టడం దారుణం అని కేసు నమోదు చేయడానికి వస్తే ఎస్ ఐ ఇద్దరి పైన కేసు చేయడం, కమవరంలో గర్భిణీ స్త్రీ పైన చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం కాదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికి న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.153 ఎమ్మెల్యే గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిక్కు మొక్కు లేకుండా చేశాడని టీచర్లు తో మద్యం దుకాణాలు దగ్గర కాపాలదారుల నిలబెట్టడం సిగ్గు చేటు అని విమర్శించారు. వ్యక్తి పని మీద వెళ్తే కొడతారు అదే మద్యం దుకాణాలకు పోతానంటే షాపు దగ్గర దిగబడతారు ఇంత దిగజారిన పనులు అధికారులు చేస్తున్నారని విమర్శించారు.మండలం లో చేయవలసిన పనుల చాల ఉన్నాయని రైతులకు నీరు గ్రామంలో నీటి వసతులు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే రెచ్చ గొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని మండి పడ్డారు. మా అధికారంలో ఇలా ఎప్పుడు జరగలేదని ఎద్దేవా చేశారు. అనంతరం ఆన్మెషీ ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చెన్నబసప్ప, వెంకట పతి, సురేష్ నాయుడు, రాజనందు, సిద్దు, కాశీ మంజు నాగరాజు తదితరులు ఉన్నారు.