YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రజారోగ్య మే ప్రభుత్వ లక్ష్యం

ప్రజారోగ్య మే ప్రభుత్వ లక్ష్యం

ప్రజారోగ్య మే ప్రభుత్వ లక్ష్యం
ఆదోని మే 7,
ప్రజారోగ్య మే ప్రభుత్వ లక్ష్యమని  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఆర్థిక  శాఖ  మంత్రి  రాజేంద్రనాథ్ అన్నారు .గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సమావేశం ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ,మంత్రాలయం ఎమ్మెల్యే  బాల నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు,డిఎస్పీ రామకృష్ణ ,సిఐ  , చంద్రశేఖర్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి   బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,మాట్లాడుతూ కరోనా వ్యాప్తిలో భాగంగా ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని  ప్రజలు భౌతిక దూరం పాటించి  మాస్కులు తప్పకుండా వాటిని ధరించి చేతులను శుభ్రం చేసుకోవడం మారువరాదన్నారు. కరోనా నిర్మూలనకు  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా వ్యాప్తిని  దరిచేరకుండా నిర్మూలించవచ్చు అన్నారు .రాష్ట్రం కోసం  మన ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి అనుక్షణం  ప్రజారోగ్యంపై  దృష్టి  సారిస్తున్నారన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర  ముఖ్యమంత్రి ,మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ,వైద్య అధికారులు నిత్యం  కరోనా నియంత్రణకై అహర్నిశలు సాయశక్తులా  కృషి చేస్తున్నామన్నారు.తో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని  ఇందుకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకారం అందించాలని  మంత్రి కోరారు.

Related Posts