YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అత్యాచారం

తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అత్యాచారం

ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు 21 ఏళ్ల ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల ఓ మహిళకు తన భర్తతో సరైన సఖ్యత లేకపోవడంతో.. మధ్యప్రదేశ్‌కు చెందిన జయవీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని జయవీర్‌తో కలిసి విజయవాడకు వెళ్లిపోయింది. అక్కడ రెండు నెలలపాటు ఉండి.. గత ఏడాది జల్‌పల్లిలోని శ్రీరామ్ కాలనీకి వచ్చారు. ఓ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో సహజీవనం చేస్తున్న జయవీర్.. ఆమె కూతురు (15)పై కన్నేశాడు. ఆమెను లోబరచుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను తనకిచ్చి పెళ్లి చేయాలని సహజీవనం చేస్తున్న మహిళను వేధించసాగాడు. అతడి ఆగడాలు భరించలేని ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Related Posts