YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఎంపీటీసీ రాజనాల మధుకుమార్
జగిత్యాల మే 07
దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి  కొనుగోలు చేయాలని ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ కొరారు.గురువారం  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాయికల్ మండలంలోని మహితాపూర్,చెర్లాకొండాపూర్ గ్రామాల ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ గృహ నిర్బంధంలో  2 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు దళారీలు నట్టేట ముంచుతున్నారని, కరోనా వ్యాధి లాక్ డౌన్ తో సతమతమవుతున్న తరుణంలో మామిడి రైతులను దళారులు విడిచిపెట్టడం లేదని, సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు  కీలక సమయంలో ఒక్కసారిగా రేటును తగ్గించేశారని,మార్కెట్టులో దళారుల దందా యథేచ్ఛగా సాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉందని, లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనేందుకు రాకపోవడంతో, స్థానిక దళారులు మామిడి రైతులను నిలువునా ముంచుతున్నారని, దీంతో పెట్టుబడి రాక  రైతులు అప్పులతో ఇంటికి వెళుతున్న పరిస్థితి  ఏర్పడుతుందని అన్నారు. గతంలో జగిత్యాల నుంచి ముంబయికి మామిడి ఎగుమతి అయ్యేదని, రవాణా నిలిచిపోవడంతో ఎగుమతులకు ఆటంకం కలుగుతోందని, గత సంవత్సరం సీజన్‌లో క్వింటాలు మామిడి రూ.6 వేల నుంచి రూ.7 వేలు ధర పలికిందని, ఇప్పుడు రూ.3500 పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపించడం మాని ప్రభుత్వమే మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకొని, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహితాపూర్ భాజపా గ్రామ అధ్యక్షుడు దుంపల రాజరెడ్డి, గంగుల భూమేష్ లు పాల్గొన్నారు.

Related Posts