కరోనా వైరస్ కు ఇద్దరు జవాన్లు బలి
న్యూ ఢిల్లీ మే 7
కరోనా వైరస్తో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోగా, మరో 41 మంది వైరస్ బారినపడ్డారని అధికారులు తెలిపారు. కరోనాతో బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోవడం ఇదే తొలిసారి. మొత్తం 193 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వైరస్ బారినపడ్డారు. సీఆర్ఫీఎఫ్కి చెందిన ఎస్ఐ గత నెల కరోనా వైరస్తో చనిపోయిన విషయం తెలిసిందే. తూర్పు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్కు చెందిన 135 మంది జవాన్లకు వైరస్ నిర్ధారణ అయ్యింది.