YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా బ్రీఫ్స్

కరోనా బ్రీఫ్స్

కరోనా బ్రీఫ్స్
న్యూఢిల్లీ, మే 7
మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అహ్మదాబాద్ నగరంలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో నిత్యావసరాల దుకాణాలను సైతం అధికారులు మూసివేయించారు. తాజాగా, సూరత్ పట్టణంలోనూ మే 9 నుంచి 14 వరకు కూరగాయలు, పండ్లు, నిత్యావసరాల దుకాణాలను సైతం మూసివేయనున్నట్టు మున్సిపల్ కమిషనర్ బంచింధి పాణి తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కూరగాయల దుకాణాల వద్ద ఏ మాత్రం భౌతికదూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉంటున్నారని, అందువల్లే వాటిని కూడా మూసివేస్తున్నామన్నారు.
====
 

Related Posts