YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అఖిలపై గంగుల హాట్ కామెంట్స్

అఖిలపై గంగుల హాట్ కామెంట్స్

అఖిలపై గంగుల హాట్ కామెంట్స్
కర్నూలు, మే 7
మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిని చంపించడానికి అఖిల ప్రియ రూ.50 లక్షలు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఇంత చిన్న వయసులోనే హత్యలు చేయించాలని చూశారని.. ముగ్గురు వ్యక్తులు కడప పోలీసులకు దొరికిపోయారని చెప్పుకొచ్చారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆళ్లగడ్డ నుంచి పారిపోయారని ఆరోపించారు.ఇక అఖిలప్రియ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. అహోబిలం నృసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని.. అక్కడ అభిషేకాలకు వెళ్లామన్నారు. తమ కోసమే ఆలయాన్ని తెరిచారని ఆరోపించడం సరికాదన్నారు. కరోనా నుంచి ప్రజల్ని బయటపడేయాలని స్వామివారికి పూజలు చేశామని.. దీనిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరాయి రాష్ట్రంలో తలదాచుకుని అఖిలప్రియ తమపై ఆరోపణలు చేస్తోందని.. ఆళ్లగడ్డలో చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా పద్దతి మార్చుకోలేదన్నారు.కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గంగుల ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గంగుల ఫ్యామిలీ కోసం అహోబిలం నృసింహస్వామి ఆలయ తలుపులు తెరిచారంటూ ఆరోపించారు. కొన్ని ఫొటోలను ట్వీట్ చేసి.. కరోనా సమయంలో అధికార పార్టీ నేతలకు మాత్రమే ఆలయాలు తెరిచారని విమర్శించారు. దీనిపై స్పందించిన గంగుల ప్రభాకర్‌రెడ్డి అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు.
 

Related Posts