సీఎం జగన్ ఫోటోకి క్షీరాభిషేకం
నెల్లూరు మే 8
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్ర తీరంలో మత్స్యకారులు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ల ఫోటోలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా లాక్డౌన్ వల్ల జీవనోపాధి లేక అల్లాడిపోతున్న తమ కుటుంబాల్లో ఆత్మస్థైర్యం కలిగించేలా మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ. 10,000 లు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని తమ బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేలా చేశారు.జిల్లాలో 15,225 మంది మత్స్యకారులకు రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అకౌంట్ లలో జమ చేస్తే, వారిలో కావలి నియోజకవర్గానికి చెందిన 6,213 మంది మత్స్యకారులు ఉండటం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మత్స్యకారుల పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపడం వల్లనే సాధ్యమైందని వారన్నారు. మా బాగు కోసం కృషి చేస్తున్న మంచోళ్ల కోసం మంచి పని చేస్తే గంగమ్మ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మత్స్యకారులు కేరింతలు కొడుతూ చెప్పారు