YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, మే 8
వైరా నియోజకవర్గం తనికెళ్ళ, సింగరాయిపాలెం గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు, రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సింగరాయిపాలెం గ్రామంలోని నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్  ,ఎమ్మెల్యే రాములు నాయక్ , మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్  తదితరులు ఉన్నారు.

Related Posts