YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కేంద్రం కక్ష సాధిస్తోంది -ఏపీ టీడీపీ ఎంపీలు

కేంద్రం కక్ష సాధిస్తోంది -ఏపీ టీడీపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం కక్ష సాధిస్తోందని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఆరోపించారు. శనివారం నాడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిలో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తమ ఆందోళనను కేంద్రం పట్టించుకోలేదని, అమిత్షా వ్యాఖ్యలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. పార్లమెంట్ సభ్యులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంపట్ల బీజేపీకి గౌరవం లేదన్నారు. అలాగే చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ మాట్లాడుతున్నారని, ఏపీ హక్కులు కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు పేర్కొన్నారు. తమ వ్యూహాలను మీరే చూస్తారని సీఎం రమేష్ తెలిపారు. జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ... చెప్పారు. జగన్ భస్మాసురుడు లాంటివడని మురళి మోహన్ చెప్పారు. నంద్యాలలో ఏమి జరిగిందో అందరికి తెలుసన్నారు .

Related Posts