YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రబాబుకు లేఖ రాసిన విష్ణు కుమార్ రాజు

చంద్రబాబుకు లేఖ రాసిన విష్ణు కుమార్ రాజు

బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు బహిరంగ లేఖ రాసారు. స్వలాభం కోసమే అఖిలపక్షం భేటి పెడుతున్నారని అయన అన్నారు.  నిరసనలు చేస్తూ భేటీ కి పిలవడం ఏమిటి. విభజన చట్టం ఉన్న హామీలను బీజేపీ నెరవేరుస్తుందని లేఖలో పేర్కోన్నారు. సైకిళ్ళు, బైక్ ర్యాలీల చవకబారు రాజకీయాలు టీడీపీ వి. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే మీరు ఎం చేసారో గుర్తు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు కు మోడీ కంటే సోనియా గాంధి, రాహుల్ గాంధీ లు ముద్దుగా కనిపిస్తున్నారు. మోడీ హామీలని నెరవేరుస్తురారు.చంద్రబాబు నాటకాలు ఆడుతూ అందరూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారని అయన అన్నారు. చంద్రబాబు యు టర్న్ తీసుకున్నది నిజం కాదా. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేది చంద్రబాబు. పట్టిసీమ లో అవినీతి జరిగింది..సాక్షాలతో నిరూపిస్తానని అయన అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. సాండ్, భూదందాలు పై బీజేపీ ముందు నుంచి పోరాడుతున్నామని అన్నారు. రైల్వే జోన్బ్ ఈ సంవత్సరం లో వస్తుంది. రాజకీయ పార్టీలు రైల్వే జోన్ విషయం వదిలి అవినీతి పై పోరాడాలి. రైల్వే జోన్ విషయం మేము తీసుకుంటామని అయన స్పష్టం చేసారు. 

Related Posts