YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వ్యాపార సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పువ్వాడ

 వ్యాపార సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పువ్వాడ

 వ్యాపార సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పువ్వాడ
ఖమ్మం మే 8 
కరోనా నేపథ్యంలో మూతపడిన దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం  కమాన్ బజార్, కస్బా బజార్ లోని వివిధ వ్యాపార సముదాయాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికే దుకాణం విడచి దుకాణం తెరిచే విధంగా నగరపాలక సంస్థ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సముదాయంలో దుకాణంలో భౌతిక దూరం ఏర్పాట్లను పరిశీలించారు. షాపులో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవలన్నారు. దూరం పాటించకుండా కార్యకలాపాలు జరిపితే వారిపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అనంతరం పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. వారి వెంట మేయర్ పాపాలాల్ గారు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి  తదితరులు ఉన్నారు.

Related Posts