YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

ఎన్ కౌంటర్ ఎస్సై, నలుగురు నక్సల్స్ మృతి

ఎన్ కౌంటర్ ఎస్సై, నలుగురు నక్సల్స్ మృతి

ఎన్ కౌంటర్ ఎస్సై, నలుగురు నక్సల్స్ మృతి
రాయపూర్ మే 09
ఛత్తీస్గఢ్ లోని పర్ధోనీ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్ కౌంటర్  జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. కాల్పుల్లో ఓ ఎస్సై కూడా ప్రాణాలు కోల్పోయారు.. మన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని అడవుల్లో సాయుధ పోలీసులు గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టరు తీవ్రంగా గాయపడి అనంతరం మరణించారు. పోలీసు కాల్పుల్లో నలుగురు నిషేధిత గ్రూపు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల నుంచి ఒక ఏకే -47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు బోర్ రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని రాజ్ నంద్ గావ్ జిల్లా ఏఎస్పీ బాఘేల్ చెప్పారు.

Related Posts