YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వస్థలాలకు పంపించాలని ఒడిశా రాష్ట్ర ప్రజల నిరసనలు

స్వస్థలాలకు పంపించాలని ఒడిశా రాష్ట్ర ప్రజల నిరసనలు

స్వస్థలాలకు పంపించాలని ఒడిశా రాష్ట్ర ప్రజల నిరసనలు
నెల్లూరు మే 9
నెల్లూరు జిల్లా మేనకూరు సెజ్ పరిధిలోని లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో పని చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తామందరని, తమ తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ శనివారం పరిశ్రమ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన మేరకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇప్పించాలని బైఠాయించారు.  ఈ సందర్భంగా స్పందించిన స్థానిక సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ మిమ్మల్ని  స్వస్థలాలకు పంపించాలంటే మీరు చేస్తున్న పరిశ్రమల యాజమాన్యం ఉత్తర్వులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.

Related Posts