YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కొత్త డ్రామాలు మొదలు పెట్టిన వామ పక్షాలు: కారెం శివాజీ

కొత్త డ్రామాలు మొదలు పెట్టిన వామ పక్షాలు: కారెం శివాజీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వామపక్షాలు కలసి కొత్త డ్రామాను మొదలు పెట్టాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని. కేంద్రం తీరుపై దేశంలోని అనేక రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. గుంటూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారని... కానీ, ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోకుండా ఉన్న జగన్ పై దళిత దండయాత్రను చేస్తామని చెప్పారు.. 

Related Posts