YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

చెన్నై మార్కెట్ తో ఏపీలో కరోనా

చెన్నై మార్కెట్ తో ఏపీలో కరోనా

చెన్నై మార్కెట్ తో ఏపీలో కరోనా
చెన్నై, మే 9
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ప్రతి 10 లక్షల జనాభాకు 3,091 పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ వల్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారిపై కూడా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు, పరీక్షలూ లేకుండా 700 మంది కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సీఎం చెప్పారు. అయితే స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు వివరించారు.అలాగే ఐసోలేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలియజేశారు. వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కి చెప్పారు. అలాగే ప్రస్తుతం సరిహద్దుల్లో 11 చోట్ల స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనలో పశువులకు కూడా చికిత్సలు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Related Posts