YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

మద్యం షాపుల్లో 500 కోట్ల స్టాక్

మద్యం షాపుల్లో 500 కోట్ల స్టాక్

మద్యం షాపుల్లో 500 కోట్ల స్టాక్
హైద్రాబాద్, మే 9,
లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత మే 6 నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభం కాగా.. మందుబాబులు, మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో లిక్కర్ స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడటం, లాక్‌డౌన్ నిబంధనలు మారే అవకాశం ఉండటంతో.. మందుబాబులు కొద్ది రోజులకు సరిపడేలా లిక్కర్ స్టాక్ తెచ్చి ఇళ్లలో ఉంచుకుంటున్నారు. మద్యానికి డిమాండ్ పెరగడంతో గత మూడు రోజుల్లో రూ. 450 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు కూడా స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు.సాధారణ పరిస్థితుల్లో ఈ స్థాయిలో మద్యాన్ని విక్రయించడానికి 12 రోజుల సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం వారం రోజుల్లోనే ఈ స్టాక్‌ అమ్ముడుపోయే అవకాశం ఉందని బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మందుబాబుల ముందు చూపుతోపాటు ధరల పెరుగుదల కూడా దీనికి కారణమైంది.రాష్ట్రంలో మద్యం విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం కాగా.. 20 మద్యం డిపోల నుంచి బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వచ్చే లెక్కల ప్రకారం బుధవారం రూ. 72 కోట్ల విలువైన ఇండెంట్లు మద్యం షాపుల నుంచి వచ్చాయి. అంటే 72 వేల కేసుల లిక్కర్, 1.12 లక్షల కేసుల బీర్లు దుకాణాలకు చేరాయి. గురు, శుక్రవారాల్లో రోజుకు 2 లక్షల కేసులకుపైగా లిక్కర్‌, లక్షల కేసుల బీర్లను మద్యం దుకాణాలు కొనుగోలు చేశాయి. ఈ మూడు రోజుల్లో 5 లక్షలకుపైగా కేసుల లిక్కర్, 3 లక్షల కేసులకుపైగా బీర్లు రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలకు చేరాయి.

Related Posts